కొత్త ట్విస్ట్... చిగురుపాటి జయరామ్ ను హత్య చేసింది రాకేష్ రెడ్డి కాదట!
- కేసును లోతుగా విచారిస్తున్న పోలీసులు
- విశాల్ అనే యువకుడిపై కొత్త అనుమానాలు
- అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు
ఇదే సమయంలో కేసులో ప్రమేయముందన్న అనుమానంతో కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ సర్పంచ్ ని కూడా విచారిస్తున్నారు. ఇదే కేసులో శిఖాను స్టేషన్ కు పిలిపించిన పోలీసులు 7 గంటల పాటు విచారించి, నిన్న రాత్రి 8 గంటలకు ఆమెను పంపించారు. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్ లను మూడు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు, కస్టడీ ముగిసేలోగా కేసులోని చిక్కుముడులన్నీ విప్పాలని భావిస్తున్నారు.