YSRCP: టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి.. వైఎస్ జగన్ తో భేటీ అయిన అవంతి శ్రీనివాస్!

  • లోటస్ పాండ్ లో జగన్ నివాసానికి వెళ్లిన టీడీపీ నేత
  • టీడీపీకి రాజీనామా చేసిన అవంతి
  • అవంతికి కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించిన జగన్

టీడీపీ నేత అవంతి శ్రీనివాస్ కొద్ది సేపటి క్రితం వైసీపీ అధినేత జగన్ ని కలిశారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉన్న జగన్ నివాసానికి ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా అవంతిని జగన్ ఆహ్వానించారు. అవంతికి పార్టీ కండువా కప్పిన జగన్, ఆయన్ని సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు. కాగా, దీనికి ముందుగా టీడీపీకి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. అవంతి తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపినట్టు సమాచారం. 

More Telugu News