Andhra Pradesh: జనసేన, వైసీపీ, టీడీపీలను టార్గెట్ చేస్తూ కేఏ పాల్ ఫన్నీ వీడియో!

  • మాకు ఈసీ ఎన్నికల గుర్తును ఇచ్చింది
  • హెలికాప్టర్, ఏరోప్లేన్, కన్ను.. వీటిలో ఏదో చెప్పుకోండి
  • నెటిజన్లకు సవాలు విసిరిన ప్రజాశాంతి అధినేత

తమ పార్టీకి ఎన్నికల గుర్తే రాదని కొందరు ఎగతాళి చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. కానీ ఎన్నికల సంఘం(ఈసీ) తమకు ఓ గుర్తును కేటాయించిందని అన్నారు.

హెలికాప్టర్, విమానం, కన్ను గుర్తుల్లో ఈసీ ఓ చిహ్నాన్ని తమకు ఇచ్చిందని పేర్కొన్నారు. ఈసీ ప్రజాశాంతి పార్టీకి ఏ గుర్తును కేటాయించిందో ఊహించి చెప్పాలని నెటిజన్లను కోరారు. ఈ వివరాలను ఫేస్ బుక్, prajasanthi party.org ద్వారా తెలియజేయాలని సూచించారు.

నెటిజన్లు తమ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్ ను తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా జనసేన, టీడీపీ, వైసీపీలను టార్గెట్ చేస్తూ ఓ ఫన్నీ వీడియోను పాల్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

More Telugu News