cheeta: కోనసీమలో చిరుత కలకలం.. ఇద్దరిపై దాడి

  • తూర్పుగోదావరి జిల్లా బలుసుల్లంకలో ఇద్దరిపై చిరుత దాడి
  • వారం రోజులుగా కోనసీమలో చిరుత సంచారం
  • భయాందోళనలకు గురవుతున్న ప్రజలు

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక పంచాయతీ పరిధిలో ఉన్న బలుసుల్లంకలో చిరుత కలకలం రేపింది. ఈ ఉదయం బహిర్భూమి కోసం తోటల్లోకి వెళ్లిన ఇద్దరు వ్యక్తులపై దాడి చేసింది. చిరుత దాడిలో చీకురమల్లి నాగేశ్వరరావు, చిన్నం శ్రీనివాసరావులు గాయపడ్డారు. గత వారం రోజులుగా కోనసీమలోని పలు ప్రాంతాల్లో ఈ చిరుత సంచరిస్తోంది. దీంతో, ఈ ప్రాంతంలోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

More Telugu News