Metro Train: కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ అధికారుల తనిఖీ.. అమీర్‌పేట్ - హైటెక్ సిటీ మార్గంలో త్వరలో మెట్రో పరుగులు

  • కొనసాగుతున్న ట్రయల్ రన్
  • పరిశీలించిన చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్
  • సేఫ్టీ సర్టిఫికెట్ రాగానే హైటెక్ వరకూ మెట్రో రైలు

హైదరాబాద్ ప్రయాణికులు ఎంతగానో ఎదురు చూస్తున్న అమీర్‌పేట్ - హైటెక్ సిటీ మార్గంలో త్వరలోనే మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. ఈ నేపథ్యంలో నేడు ఈ మార్గాన్ని కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా.. ఉప్పల్ డిపోతో పాటు అమీర్‌పేట్ నుంచి హైటెక్ సిటీ మార్గాన్ని చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ రాజు తదితరులు పరిశీలించారు. ఇప్పటికే ఈ మార్గంలో ట్రయల్ రన్ కొనసాగుతుండగా.. కమిషనర్ ఆఫ్ మెట్రో సేఫ్టీ నుంచి సర్టిఫికెట్ రావటమే ఆలస్యం ప్రయాణికులకు మెట్రో రైలు అమీర్‌పేట్ - హైటెక్ సిటీ మార్గంలో సైతం అందుబాటులోకి వస్తుంది.

More Telugu News