Madhulika: మధులిక ఎప్పుడు రాస్తానంటే అప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్: బోర్డు హామీ

  • ప్రేమోన్మాది దాడితో తీవ్రగాయాలు
  • ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్న మధులిక
  • విడిగా పరీక్షలు నిర్వహిస్తామన్న బోర్డు

తనను ప్రేమించడం లేదన్న అక్కసుతో ఓ ఉన్మాది కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో దాడి చేయగా తీవ్రంగా గాయపడి, చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్న మధులికను ఉద్దేశించి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఊరట కలిగే వ్యాఖ్యలు చేసింది. ఆమె పూర్తిగా కోలుకున్న తరువాత ఎప్పుడు పరీక్షలు రాస్తానని చెబితే, అప్పుడు ప్రత్యేకంగా ఎగ్జామ్స్ పెడతామని బోర్డు కార్యదర్శి అశోక్ హామీ ఇచ్చారు. అశోక్ ను కలిసిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నేతలు, మధులిక కోసం ప్రత్యేకంగా పరీక్షలు పెట్టాలని కోరగా, ఆయన స్పందించారు. మధులిక కోలుకోవాలని తాను కోరుకుంటున్నానని, పరీక్షలకు తొందరేమీ లేదని అశోక్ వ్యాఖ్యానించారు.

More Telugu News