Andhra Pradesh: ఏపీపీఎస్సీ నుంచి మళ్లీ నోటిఫికేషన్లు జారీ!

  • భర్తీ కానున్న 550 ఉద్యోగాలు
  • అటవీ శాఖ, గిరిజన, బీసీ సంక్షేమ శాఖల్లో ఖాళీలు
  • సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలోనూ ఖాళీలు

ఏపీపీఎస్సీ నుంచి మళ్లీ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఈ నోటిఫికేషన్ల ద్వారా 550 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. అటవీ శాఖ, గిరిజన, బీసీ సంక్షేమ శాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో ఉద్యోగాల భర్తీ నిమిత్తం ఆయా నోటిఫికేషన్లను విడుదల చేయడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు ఏపీపీఎస్సీ కమిషన్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

అటవీ శాఖలో.. 

అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్లు- 50
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు- 330
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు- 100

దరఖాస్తు తేదీ.. మార్చి 5 నుంచి 27 వరకు

గిరిజన, బీసీ సంక్షేమ శాఖలో..

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు - 28

దరఖాస్తు  తేదీ .. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 20 వరకు

సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో..

డిప్యూటీ మేయర్లు- 29

దరఖాస్తు  తేదీ... ఫిబ్రవరి  20 నుంచి మార్చి 13 వరకు

ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ లో- 18  

దరఖాస్తు తేదీ ..   ఫిబ్రవరి 19 నుంచి మార్చి 13 వరకు

More Telugu News