Mangalagiri: మంగళగిరిలో ప్రేమజంటపై దాడి ఘటనలో... నిందితులు ప్రియుడి స్నేహితులే!

  • శ్రీనివాసరావు ఇద్దరు స్నేహితులు అరెస్ట్
  • శ్రీనివాసరావు, జ్యోతిల సెల్ ఫోన్లు సీజ్
  • కేసును లోతుగా విచారిస్తున్నామన్న పోలీసులు

గత రాత్రి మంగళగిరిలో ప్రేమజంటపై దాడి చేసి, ప్రియుడు శ్రీనివాసరావును చావగొట్టి, ప్రియురాలు జ్యోతిపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఓ కొలిక్కి తెచ్చారు. శ్రీనివాసరావు స్నేహితులే ఈ దారుణానికి తెగబడ్డారంటూ, ఇద్దరిని అరెస్ట్ చేశారు. జ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన తరువాత, ఆమె సెల్ ఫోన్ ను, శ్రీనివాసరావు సెల్ ఫోన్ ను సీజ్ చేసిన పోలీసులు, కాల్ లిస్ట్ ఆధారంగా వెంటనే నిందితులెవరో గుర్తించినట్టు తెలుస్తోంది.

వీరిద్దరూ కలిసి బైక్ పై వెళుతున్నారన్న సమాచారం వారికి ముందే తెలిసిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నామని అధికారులు వెల్లడించారు. కాగా, గత రాత్రి తాడేపల్లి, మహానాడు రోడ్డుకు చెందిన చుంచు శ్రీనివాసరావు, అతని ప్రియురాలు అంగడి జ్యోతితో కలిసి సర్టిఫికెట్ల కోసం గుంటూరు వెళుతుండగా, అమరావతి స్టేడియం సమీపంలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. 

More Telugu News