నాలుగో రోజుకు చేరిన గుజ్జర్ల ఆందోళన.. రాజస్థాన్లో పెద్ద ఎత్తున రైళ్ల బంద్
- శుక్రవారం నుంచి కొనసాగుతున్న ఆందోళన
- 250 రైళ్ల రాకపోకలపై ప్రభావం
- రైళ్లను రద్దు చేస్తున్న అధికారులు
సోమవారం 21 రైళ్ల రాకపోకలను నిలిపివేసిన అధికారులు 18 రైళ్లను దారి మళ్లించారు. నేడు 21 రైళ్లను రద్దు చేసి, 8 రైళ్లను దారి మళ్లించారు. అలాగే, బుధవారం నడవాల్సిన 15 రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. శుక్రవారం ప్రారంభమైన ఈ ఆందోళన ప్రభావం ఈ ప్రాంతం గుండా నడిచే 250కిపైగా రైళ్లపై పడింది. కాగా, ఆదివారం గుజ్జర్లు నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది.