పోరాడి సాధించుకుందాం.. ప్రాణాలు పోగొట్టుకోవద్దు: ఢిల్లీలో శ్రీకాకుళం వాసి మృతిపై చంద్రబాబు
- శ్రీకాకుళం వాసి మృతి మనసును కలచివేసింది
- మృతుడు.. దివ్వల అర్జునరావుగా గుర్తింపు
- సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
మృతుడిని శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కింతలి గ్రామానికి చెందిన దివ్వల అర్జునరావు (40)గా గుర్తించామన్నారు. అర్జునరావు కుటుంబానికి చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతికి సంతాపంగా నేతలంతా వేదికపై రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోనూ ఒక న్యాయవాది ఆత్మహత్యకు యత్నించారని.. ఆయనకు ధైర్యం చెప్పాలని అధికారులను ఆయన వద్దకు పంపించినట్టు సీఎం తెలిపారు.