kalyan dev: అవయవదానం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన మెగాస్టార్ చిన్నల్లుడు!

  • అపోలో ఆసుపత్రికి అంగీకార పత్రం
  • చనిపోయాక దేన్నీ వెంట తీసుకెళ్లలేమని వ్యాఖ్య
  • ట్విట్టర్ లో స్పందించిన కల్యాణ్ దేవ్

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మరణానంతరం అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు తన అంగీకార పత్రాన్ని అపోలో ఆసుపత్రికి అందజేశారు. ఈ విషయాన్ని కల్యాణ్ దేవ్ ట్విట్టర్ లో తన అభిమానులతో పంచుకున్నారు.

‘ట్విట్టర్ లో సరైన సందర్భంగానే అభిమానులు, ప్రజల ముందుకు రావాలనుకున్నా. మరణానంతరం నా అవయవాలను దానం చేసేందుకు ప్రతిజ్ఞ చేశా. మనం ఈ ప్రపంచాన్ని వదిలివెళ్లేటప్పుడు దేన్నీ వెంట తీసుకెళ్లలేం’ అని కల్యాణ్ దేవ్ ట్వీట్ చేశారు.

More Telugu News