Chandrababu: రేపే ధర్మపోరాట దీక్ష.. మరికాసేపట్లో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చంద్రబాబు

  • ఏపీ భవన్ ప్రాంగణంలో దీక్ష
  • మద్దతు తెలపనున్న విపక్ష నేతలు
  • 12న రాష్ట్రపతికి వినతి పత్రం

ఏపీ పట్ల కేంద్రం వైఖరిని నిరసిస్తూ సోమవారం ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ధర్మపోరాట దీక్షను తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు మరికాసేపట్లో ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరనున్నారు. ఏపీ భవన్ ప్రాంగణంలో రేపు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ దీక్ష చేపట్టనున్నారు. జాతీయ స్థాయిలో విపక్ష నేతలు ఈ దీక్షకు మద్దతు తెలపనున్నారు.

ఢిల్లీలో దీక్ష చేయడం ద్వారా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నారు. ఈ నెల 12న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని కలిసి వినతి పత్రం సమర్పించనున్నారు. దీక్షలో పాల్గొనే ప్రజల కోసం రెండు రైళ్లను ఏపీ ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఒక రైలు అనంతపురం నుంచి మరో రైలు శ్రీకాకుళం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లాయి.

More Telugu News