vote-note: ఎన్నికలకు ముందే ఓటుకు నోటు కేసులో నిందితులను శిక్షించాలి: జెరూసలెం మత్తయ్య డిమాండ్

  • సీఎం కేసీఆర్ ప్రలోభాలకు గురి చేశారు
  • ఏపీ సీఎం చంద్రబాబు రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడ్డారు
  • న్యాయం చేయాలి.. 11న ఢిల్లీలో నిరసన చేపడుతున్నా

ఎన్నికలకు ముందే ఓటుకు నోటు కేసులో నిందితులను శిక్షించాలని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జెరూసలెం మత్తయ్య డిమాండ్ చేశారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ,  ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తనను ప్రలోభాలకు గురి చేస్తే, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ కేసులో తెలంగాణ సర్కార్ తన పేరు మార్చడాన్ని ఖండించారు. ఈ కేసులో తనను నిర్దోషిగా హైకోర్టు ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 11న ఢిల్లీలో నిరసన చేపడుతున్నట్టు వెల్లడించారు. తన దీక్షకు పలు క్రైస్తవ సంఘాలు మద్దతు పలుకుతున్నట్టు చెప్పారు.

More Telugu News