Andhra Pradesh: నిద్రమత్తులో అదుపు తప్పిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి దుర్మరణం!

  • ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో ఘటన
  • రెయిలింగ్ ను బలంగా ఢీకొట్టిన కారు
  • కేసు నమోదు చేసిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పెద్ద తాడేపల్లి జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న ఓ కారు అదుపు తప్పి పక్కనే ఉన్న రెయిలింగ్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారును నడుపుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంజనీర్ వారపరెడ్డి శ్రీనివాస్ కు తీవ్ర గాయాలు కాగా, ఆయన మనవడు అరుష్(1), భార్య అన్నపూర్ణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. నిద్రమత్తులో వాహనం అదుపు తప్పడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నామన్నారు.  మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

More Telugu News