sakshi: ‘సాక్షి’ యాజమాన్యానికి నోటీసులు జారీ చేయాలని కోరుతున్నా: ఏపీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్

  • సబ్ ప్లాన్ పేరుతో బోగస్ బిల్లు కథనం అసత్యం
  • ఇది ప్రచురించడమంటే సభను అవమానించడమే
  • సెక్షన్ 169 రూల్ 2 కింద ఈ మేరకు నోటీసులు

సాక్షి దినప్రతిక లో సబ్ ప్లాన్ పేరుతో బోగస్ బిల్లు కథనం దురుద్దేశ పూర్వకంగా ప్రచురించారని ఏపీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ఆరోపించారు. శాసనసభ ప్రవర్తనా నియమావళి సెక్షన్ 169 రూల్ 2 కింద ఈ మేరకు నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు. ఇలాంటి కథనాన్ని ప్రచురించడమంటే శాసన సభను అవమానించడమేనని, పవిత్రను దెబ్బతీయడమేనని  అన్నారు. శాసనసభతో పాటు సభ్యుడిగా సంక్రమించిన రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిందని, ఈ నేపథ్యంలో సాక్షి యాజమాన్యానికి నోటీసులు జారీ చేయాలని కోరారు.

More Telugu News