kalyan malik: వెన్నుపోటు పొడిచారు .. లక్షల్లో నష్టపోయాను: కల్యాణ్ మాలిక్

  • ఇల్లు కొనుక్కుందామని అనుకున్నాను
  • స్థలాల రేట్లు పెరుగుతాయని నమ్మించారు
  • డబ్బంతా అలా పోయింది   

తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు కల్యాణ్ మాలిక్ మాట్లాడుతూ ... తనని ఆర్ధికంగా దెబ్బతీసిన ఒక సంఘటనను గురించి ప్రస్తావించారు. " కొండాపూర్ లో నేను కొనుకున్న ఒక ఫ్లాట్ ను 2005లో అమ్మేశాను. ఆ డబ్బుతో యూసఫ్ గూడాలో ఇల్లు కొందామని ఉమా .. నేను ప్లాన్ చేశాము. ఆ సమయంలోనే మాకు బాగా దగ్గరి వాళ్లు వచ్చారు. ఆ డబ్బుతో ఫలానా చోట స్థలం కొంటే 6 నెలల్లో రెట్టింపు అవుతుందని చెప్పేసి .. ఆ డబ్బంతా అక్కడ పెట్టేలా చేశారు.

ఆ తరువాత అవి బోగస్ సైట్స్ అని తెలిసింది. బాగా దగ్గర వాళ్లని గుడ్డిగా నమ్మేయడం వలన, 40 లక్షల వరకూ నష్టపోయాను. నేను కొంటున్నాను గదా అని మా అక్కయ్య కూడా తీసుకుని 30 లక్షలు తను నష్టపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే అవతలవాళ్లు నమ్మించి వెన్నుపోటు పొడిచారు. అంత డబ్బు నష్టపోయిన నేను కోలుకోవడానికి చాలా కాలం పట్టింది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News