Jagan: జగన్ పై దాడి కేసు.. మీడియాలో చార్జ్ షీట్ వివరాలు రావడంపై ఎన్ఐఏ కోర్టు ఆగ్రహం!

  • నేటితో ముగిసిన శ్రీనివాసరావు రిమాండ్
  • ఎన్ఐఏ కోర్టు ముందు హాజరుపర్చిన అధికారులు
  • ఈ నెల 22 వరకూ రిమాండ్ పొడిగించిన కోర్టు

వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఈరోజు పోలీసులు ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం శ్రీనివాసరావుకు ఈ నెల 22 వరకూ రిమాండ్ ను పొడిగించింది. ఈ నేపథ్యంలో నిందితుడిని అధికారులు మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

కాగా, విచారణ సందర్భంగా జగన్ పై దాడి కేసులో చార్జ్ షీట్ వివరాలు మీడియాలో రావడంపై ఎన్ఐఏ న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాలో ఈ ఘటనపై ఇష్టానుసారం కథనాలు రావడంపై అసంతృప్తి వెలిబుచ్చారు.

More Telugu News