Achennaidu: కాపు రిజర్వేషన్ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

  • 10 శాతం రిజర్వేషన్‌లో కాపులకు 5 శాతం
  • అచ్చెన్నాయుడు ప్రవేశ పెట్టిన తీర్మానంపై చర్చ
  • బీసీ సబ్‌ప్లాన్‌కు మూడో వంతు నిధులు

కాపు రిజర్వేషన్ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బీసీ సబ్‌ప్లాన్ బిల్లుపై మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశ పెట్టిన తీర్మానంపై సభలో చర్చ జరిగింది. ఈ బిల్లును ఎమ్మెల్యేలంతా సమర్థించగా.. సబ్‌ప్లాన్‌‌కు చట్టబద్ధత కల్పించాలన్న తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇచ్చే 10 శాతం రిజర్వేషన్‌లో కాపులకు 5 శాతం కేటాయించాలని అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. అలాగే బీసీ సబ్‌ప్లాన్‌కు మూడో వంతు నిధులు కేటాయించాలని తీర్మానించింది.


More Telugu News