AR Anuradha: సమైక్యాంధ్ర, ప్రత్యేక హోదా ఉద్యమాలలో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేయాలని హోంశాఖ నిర్ణయం

  • ఉత్తర్వులు జారీ చేసిన ఏఆర్ అనురాధ
  • తగు చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచన
  • పీఎస్‌లలో నమోదైన కేసులన్నీ ఎత్తివేసేందుకు చర్యలు

సమైక్యాంధ్ర, ప్రత్యేక హోదా ఉద్యమాలలో పాల్గొని కేసులు ఎదుర్కుంటున్న వారికి ఊరటనిచ్చే వార్త ఇది. వారిపై నమోదైన కేసులన్నీ ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను ఎత్తివేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ సూచించారు.

More Telugu News