టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయడం వల్లే నేను గెలిచా!: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

  • పవన్ కల్యాణ్, టీడీపీ, బీజేపీకి ధన్యవాదాలు
  • నేను ఏ నేతనూ కించపరిచి మాట్లాడలేదు
  • ఏపీ అసెంబ్లీలో విష్ణుకుమార్ రాజు వ్యాఖ్య
2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడం వల్లే తనకు ఇక్కడ కూర్చునే అవకాశం వచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. కాబట్టి టీడీపీ, బీజేపీ, పవన్ కల్యాణ్ కు తాను ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విష్ణుకుమార్ రాజు ఈరోజు మాట్లాడారు. ఏ ఒక్క నేతనూ తాను కించపరిచి మాట్లాడలేదనీ, విధివిధానాల్లో లోపాలను మాత్రమే తప్పుపట్టానని వ్యాఖ్యానించారు. గత నాలుగున్నరేళ్ల కాలంలో సంక్షేమ పథకాల అమలు ఏపీలో బాగానే జరిగిందని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
BJP
Jana Sena
Pawan Kalyan
vishnu kumar raju

More Telugu News