KGF: నాడు 'చంద్రలేఖ'లో గెస్ట్ గా కనిపించిన సంజయ్ దత్... మళ్లీ ఇప్పుడు 'కేజీఎఫ్' సీక్వెల్ లో!

  • గెస్ట్ పాత్రలో కనిపించనున్న సంజూ
  • బాలీవుడ్ లో హైప్ క్రియేట్ చేసేందుకు చాన్స్
  • వచ్చే సంవత్సరం విడుదల కానున్న కేజీఎఫ్-2

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ మరో దక్షిణాది చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. దాదాపు 21 సంవత్సరాల క్రితం నాగార్జున హీరోగా వచ్చిన 'చంద్రలేఖ' చిత్రంలో సంజూ గెస్ట్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఆపై మరే దక్షిణాది చిత్రంలోనూ సంజయ్ నటించలేదు.

తాజాగా పలు భారతీయ భాషల్లో విడుదలై ఘన విజయం సాధించిన 'కేజీఎఫ్' సీక్వెల్ తయారవుతుండగా, అందులో నటించేందుకు సంజయ్ దత్ ఓకే చెప్పాడట. యష్ హీరోగా, సంజయ్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కేజీఎఫ్' తొలి భాగం హిందీలో సైతం సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. రెండో భాగంలో సంజయ్ కనిపిస్తే, బాలీవుడ్ లో మంచి హైప్ వస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. త్వరలో షూటింగ్ పార్ట్ ను ప్రారంభించి, వచ్చే సంవత్సరం చివర్లో సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

More Telugu News