golkonda: గోల్కొండ కోటపై ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయంలో చోరీకి యత్నం

  • ఆదివారం రాత్రి చోరీకి యత్నం
  • సీసీ కెమెరాలు ధ్వంసం
  • హుండీలను ఎత్తుకెళ్లేందుకు విశ్వప్రయత్నం

గోల్కొండ కోటపై ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆదివారం రాత్రి చోరీ యత్నం జరిగింది. అయితే, ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చోరీకి యత్నించిన దుండగులు ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. హుండీలను ఎత్తుకెళ్లేందుకు విశ్వప్రయత్నం చేశారు. దీన్ని గమనించిన ఆలయ పూజారి... గోల్కొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బోనాల సమయంలో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున తొలి బోనాన్ని మహంకాళి అమ్మవారికి సమర్పించడం ఆనవాయతీగా వస్తోంది. 

More Telugu News