prabhas: ప్రభాస్ 'సాహో' మూవీ అప్ డేట్

  • 50 శాతం చిత్రీకరణ పూర్తి
  • జూలై నుంచి ప్రమోషన్స్ 
  • ఆగస్టు 15వ తేదీన విడుదల     

ప్రభాస్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'సాహో' సినిమాపైనే వుంది. సుజిత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అంతా కుతూహలాన్ని చూపుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చాలా వరకూ చిత్రీకరించారు. ఇప్పటికి ఈ సినిమా 50 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది.

మే నెల చివరినాటికి షూటింగు పార్టును పూర్తి చేసి, జూన్ లో మిగతా పనులను కానిచ్చేసి .. జూలై నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టాలనే నిర్ణయానికి వచ్చారట. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్ కనిపించనుంది. పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఇండియాలోనే భారీ విజువల్స్ తో రానున్న తొలి సినిమా ఇదేనని అంటున్నారు.

  • Loading...

More Telugu News