ఊరంతా కరెంట్ తీసేసి... శిఖా చౌదరిని రహస్యంగా తరలించిన నందిగామ పోలీసులు!
- కృష్ణా జిల్లా నందిగామలో హైడ్రామా
- రెండు వాహనాలను సిద్ధం చేసుకున్న పోలీసులు
- ఒకటి హైదరాబాద్ వైపు, మరొకటి విజయవాడవైపు
ఒక వాహనంలో శిఖాను ఎక్కించారు. ఏ వాహనంలో ఆమె ఉందో మీడియా కంటపడకుండా జాగ్రత్త పడ్డారు. ఆపై రెండు వాహనాల్లో ఒకటి విజయవాడవైపు, మరొకటి హైదరాబాద్ వైపు వెళ్లిపోయాయి. ఈ వాహనాలను మీడియా వెంబడించినా, ఆమె ఎందులో ఉందన్న విషయం మాత్రం తెలుసుకోలేకపోయారు. కాగా, జయరామ్ హత్య హైదరాబాద్ లో జరిగినట్టు తేలడంతో, కేసును అక్కడి పోలీసులకే అప్పగించాలని నిర్ణయించుకున్న కృష్ణా జిల్లా ఉన్నతాధికారులు, ఆమెను హైదరాబాద్ కే తరలించినట్టు తెలుస్తోంది.