Hyderabad: శంషాబాద్‌లో రెండస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం

  • కూలర్లు తయారు చేసే పరిశ్రమలో విద్యుదాఘాతం
  • మంటలను అదుపు చేస్తున్న నాలుగు ఫైరింజన్లు
  • కార్మికులు బయటకు పరిగెత్తడంతో తప్పిన ప్రాణనష్టం

విద్యుదాఘాతం కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరగడంతో హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో కలకలం రేగింది. శంషాబాద్ మండలం శాతంరాయిలోని రెండస్తుల భవనంలో విడిభాగాలతో కూలర్లు తయారు చేసే పరిశ్రమను నిర్వహిస్తున్నారు.

అయితే నేటి సాయంత్రం ఈ భవనంలో విద్యుదాఘాతం కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు నాలుగు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. మంటలు చెలరేగిన వెంటనే కార్మికులు భయంతో బయటకు పరుగులు తీయడంతో ప్రాణ నష్టం తప్పింది.

  • Loading...

More Telugu News