payal: 'మన్మథుడు 2' లో ఛాన్స్ కొట్టేసిన పాయల్

  • నాగ్ కెరియర్లో 'మన్మథుడు' ప్రత్యేకం
  • దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ 
  • ఇద్దరు కథానాయికలకు చోటు  

నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో 'మన్మథుడు' ముందువరుసలో కనిపిస్తుంది. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. అప్పటి నుంచి ఈ సినిమాకి  సీక్వెల్ చేయాలనే ఆలోచనలో నాగార్జున వున్నారు .. అది ఇప్పటికి కుదిరింది.

నాగార్జున హీరోగా .. ఆయన సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితం కానుంది. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటు వుంటుందట. ఒక కథానాయికగా పాయల్ రాజ్ పుత్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో పాయల్ కి యూత్ లో ఒక రేంజ్ లో క్రేజ్ పెరిగిపోయింది. ఆల్రెడీ రవితేజ సినిమాలోనూ ఆమె ఒక కథానాయికగా ఎంపికైంది. నాగార్జున సరసన తగిలిన ఛాన్స్ ఆమె కెరియర్ మరింత స్పీడ్ గా ముందుకు తీసుకెళుతుందేమో చూడాలి.

More Telugu News