Kanna Lakshminarayana: ప్రత్యేక హోదాపై ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ అభిప్రాయం... తనతో మాట్లాడుతున్న వీడియోను పోస్ట్ చేసిన కన్నా!

  • హోదా కోసం టీడీపీ ధర్మపోరాట దీక్షలు
  • గతంలో కన్నాతో మాట్లాడిన రాధాకృష్ణ
  • ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ తెలుగుదేశం పార్టీ ధర్మపోరాట దీక్షలు చేస్తున్న వేళ, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో కన్నా లక్ష్మీనారాయణ ఈ వీడియోలో మాట్లాడుతున్నారు. "మీ సొంత మీడియా అధినేత రాధాకృష్ణ స్వయంగా ప్రత్యేక హోదాపై ఏమి మాట్లాడుతున్నారో వినండి. వాస్తవాలను మీ రాజకీయ లబ్ది కోసం అబద్ధాలుగా... యూ-టర్న్ తీసుకుని రంగులు మార్చి యెల్లో మీడియాతో కలిసి  ఊసరవల్లి సిగ్గుపడేలా రాజకీయాలు చేస్తున్న మిమ్మల్ని ప్రజలు క్షమించరు" అని దానికి క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి కలిగే లబ్ది స్వల్పమేనని ఇందులో రాధాకృష్ణ అభిప్రాయపడ్డట్టు ఉండటం గమనార్హం.




More Telugu News