India: కోహ్లీతో పాటు ధోనీకీ విశ్రాంతి... కొత్తోళ్లొచ్చారు... టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న న్యూజిలాండ్!

  • మరికాసేపట్లో నాలుగో వన్డే
  • హామిల్టన్ వేదికగా పోరు
  • రంగంలో దినేష్ కార్తీక్, ఖలీల్ అహ్మద్

ఇప్పటికే న్యూజిలాండ్ తో జరుగుతున్న సిరీస్ ను 3-0 తేడాతో గెలుచుకున్న ఇండియా, నేడు హామిల్టన్ లో నాలుగో వన్డేకు సిద్ధం కాగా, కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన బీసీసీఐ, రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు అప్పగించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ను ఎంచుకుంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ తో భారత్ ఖలీల్ అహ్మద్ ను జట్టులోకి చేర్చుకుని, కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ స్థానంలో దినేష్ కార్తీక్ ను రంగంలోకి దించింది.  

ఇరు జట్ల వివరాలు-
ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, శుభమన్ గిల్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, దినేష్ కార్తీక్ (కీపర్), హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కులదీప్ యాదవ్, యజువేంద్ర చాహాల్, ఖలీల్ అహ్మద్.
న్యూజిలాండ్: మార్టిన్ గుప్తిల్, హెన్రీ నికోలస్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లాథమ్ (కీపర్), జిమ్మీ నీషామ్, మిచెల్ శాంట్నర్, కోలిన్ డీ గ్రాండ్ హోమ్, టోడ్ ఆస్టిల్, మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్.

More Telugu News