Mahesh Babu: మహేష్‌తో సినిమాపై స్పందించిన కత్రినా

  • మహేష్‌తో నటిస్తున్నానని పుకార్లు 
  • నేను వేరే చిత్రంపై దృష్టి పెట్టలేను
  • ‘భారత్’ తర్వాత ఏ చిత్రానికీ సంతకం చేయలేదు

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ చిత్రంలో నటిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆ సినిమా తర్వాత బాలీవుడ్ భామ కత్రినా కైఫ్‌తో చేస్తున్నారనే వార్తలు బాగా వినిపించాయి. ఈ వార్తలు కత్రినాను చేరడంతో ఆమె దీనిపై స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తాను మహేష్‌బాబుతో సినిమా చేయబోతున్నానని చాలా మంది అనుకుంటున్నారని తెలిసిందని, అందుకే ఇలాంటి పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టాలనుకుంటున్నట్టు తెలిపింది. ‘భారత్’ తర్వాత తాను ఏ చిత్రానికీ ఇంకా సంతకం చేయలేదని స్పష్టం చేసింది. రంజాన్ సందర్భంగా ‘భారత్’ను విడుదల చేయాలనుకుంటున్నామని.. కాబట్టి తాను వేరే చిత్రాలపై దృష్టి పెట్టలేనని కత్రినా తెలిపారు.

More Telugu News