Hyderabad: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన సందర్శకులు

  • భయాందోళనలకు గురైన సందర్శకులు
  • స్టాల్ నుంచి పెద్ద ఎత్తున మంటలు
  • ఫైరింజన్లతో మంటల అదుపు

నేటి సాయంత్రం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపింది. స్టాల్స్ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడటంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు వచ్చిన సందర్శకులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News