amrutha: పెళ్లిరోజు నాడు పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అమృత.. తల్లీబిడ్డలు క్షేమం

  • సాయంత్రం 4.15 గంటలకు బిడ్డకు జన్మనిచ్చిన అమృత
  • ప్రణయ్ మళ్లీ పుట్టాడని సంతోషపడుతున్న కుటుంబసభ్యులు
  • ప్రణయ్ ను పరువుహత్య చేయించిన అమృత తండ్రి

మిర్యాలగూడలో పండంటి మగ బిడ్డకు అమృత జన్మనిచ్చింది. ఈరోజు సాయంత్రం 4.15 గంటలకు ఆమెకు డెలివరీ అయింది. తల్లీ, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఈరోజు అమృత, ప్రణయ్ ల పెళ్లిరోజు కూడా కావడం గమనార్హం. దీంతో ప్రణయ్ మళ్లీ తమ ఇంట్లో అడుగుపెట్టాడని కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అమృత, ప్రణయ్ లు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తమ పరువు పోయిందని భావించిన అమృత తండ్రి ప్రయణ్ ను కిరాతకంగా హత్య చేయించాడు.

  • Loading...

More Telugu News