Uttar Pradesh: మాయావతిపై బీజేపీ యూపీ చీఫ్ అనుచిత వ్యాఖ్యలు!

  • ఎస్పీ-బీఎస్పీ పొత్తు తర్వాత బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు 
  • మాయావతిపై మొన్న సాధనా సింగ్ అనుచిత వ్యాఖ్యలు
  • నేడు అంతకుమించిన వ్యాఖ్యలు చేసిన మహేంద్రనాథ్ 

బీఎస్పీ చీఫ్ మాయావతిపై బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి. మొన్నటికి మొన్న ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యే సాధనా సింగ్ మాట్లాడుతూ.. మాయవతి హిజ్రాలకంటే దారుణమని, ఇంతకీ ఆమె ఆడా? మగా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవి తీవ్ర దుమారం రేపాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ మహేంద్ర నాథ్ పాండే అంతకుమించిన వ్యాఖ్యలు చేశారు.

ఎస్పీ-బీఎస్పీ పొత్తు పెట్టుకోవడంపై యూపీ బీజేపీ చీఫ్ మహేంద్ర నాథ్ పాండే మాట్లాడుతూ..1995లో లక్నో గెస్ట్‌హౌస్‌లో సమాజ్‌వాదీ పార్టీ నేతల నుంచి మాయావతికి ఎదురైన అవమానాన్ని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన మాయావతి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న అఖిలేశ్ యాదవ్.. మాయావతికి శాలువా కప్పి చెవిలో ఏదో రహస్యం చెప్పారని పాండే అన్నారు.

 ఆ రహస్యం ఏమిటంటే.. తాను కప్పిన శాలువా అప్పట్లో లక్నో గెస్ట్‌హౌస్‌లో తన తండ్రి ములాయం సింగ్ మీ నుంచి లాగేసిందేనని ఆమెతో చెప్పారని, అందుకు మాయావతి ‘చల్ నాటీ’ అని బదులిచ్చారంటూ వ్యాఖ్యలు చేశారు. అదే వేదికపై ఉన్న కేంద్రమంత్రులు జేపీ నడ్డా, మనోజ్ సిన్హా వంటి వారు ఆ జోక్‌కు చిన్నగా నవ్వడం కనిపించింది.

More Telugu News