Chandrababu: సంక్షేమ పథకాలపై అధికారులతో నేడు చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌

  • పాల్గొననున్న కలెక్టర్లు, మండల స్థాయి అధికారులు
  • ప్రధానంగా తొమ్మిది అంశాలపై సమీక్ష
  • జన్మభూమిలో వచ్చిన ఫిర్యాదులపైనా చర్చ

సంక్షేమ పథకాలు, జన్మభూమిలో వచ్చిన ఫిర్యాదులు, చంద్రన్న బీమా, పెళ్లికానుక, యువనేస్తం, అన్నక్యాంటీన్లు, గృహనిర్మాణం తదితర అంశాలపై చర్చించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ల నుంచి మండల స్థాయి అధికారుల వరకు అంతా పాల్గొనాలని ఆదేశాలు అందాయి.

ఉదయం 10 గంటల తర్వాత నిర్వహించే ఈ సమావేశంలో ప్రధానంగా 9 సంక్షేమ పథకాలపై చర్చించనున్నారు. అలాగే మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహిస్తారు. బడ్జెట్‌ రూపకల్పన, గవర్నర్‌ ప్రసంగంపై చర్చిస్తారు. సాయంత్రం 4 గంటలకు పోలవరం, సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష జరుపుతారు.

More Telugu News