Andhra Pradesh: ఎరుపు రంగులో మెరిసిపోతున్న జనసేన గుంటూరు కార్యాలయం..ఫొటోలు విడుదల చేసిన పార్టీ!

  • గుంటూరులో నేడు జనసేనాని పర్యటన
  • సమరశంఖారావం సభలో పాల్గొననున్న పవన్
  • ఏర్పాట్లు పూర్తిచేసిన పార్టీ నేతలు, కార్యకర్తలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు గుంటూరు జిల్లాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. తొలుత విజయవాడ నుంచి గుంటూరుకు పవన్ వస్తారు. ఆ తర్వాత జిల్లాలో కొత్తగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం లూథరన్ పాఠశాల క్రీడా మైదానంలో సాయంత్రం 5 గంటలకు జరిగే ‘సమర శంఖారావం’ సభలో పాల్గొంటారు. ఇందుకోసం పార్టీ నేతలు, కార్యకర్తలు ఏర్పాట్లను పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ గుంటూరు జిల్లాలో నిర్మించిన నూతన కార్యాలయం ఫొటోను విడుదల చేసింది. ఎరుపు రంగులో అద్భుతంగా ఉన్నజనసేన ఆఫీస్ ఫొటోలను మీరూ చూసేయండి.

More Telugu News