Andhra Pradesh: నేడు గుంటూరులో పవన్ టూర్.. సాయంత్రం 5 గంటలకు ‘సమర శంఖారావం’ బహిరంగ సభ!

  • ఏర్పాట్లు పూర్తిచేసిన జనసేన శ్రేణులు
  • లూథరన్‌ పాఠశాల మైదానంలో వేదిక
  • గుంటూరు ఆఫీసును ప్రారంభించనున్న జనసేనాని

జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోరు పెంచారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు వీలుగా బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలోని లూథరన్‌ పాఠశాల క్రీడామైదానంలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు ‘సమర శంఖారావం’ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల సాధనలో అధికార టీడీపీ, విపక్ష వైసీపీల వైఫల్యాన్ని జనసేనాని ఈ సభలో ఎండగట్టనున్నారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ మాదాసు గంగాధరం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్‌, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, రాష్ట్ర కోఆర్డినేటర్లు మాదా రాధాకృష్ణమూర్తి, షేక్‌ సయ్యద్‌బాబు ఈ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

జనసేన సభకు భారీ సంఖ్యలో అభిమానులు, మద్దతుదారులు తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి తొక్కిసలాటలు చోటుచేసుకోకుండా 600 మంది జనసేన వాలంటీర్లను రంగంలోకి దించారు. ఈరోజు సాయంత్రం 3 గంటలకు జనసేన పార్టీ గుంటూరు ఆఫీసును పవన్ ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి 4 గంటలకు బయలుదేరి సభావేదిక వద్దకు ర్యాలీగా చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు సభ ప్రారంభం అవుతుంది.

  • Loading...

More Telugu News