Chandrababu: ఎట్ హోం కార్యక్రమానికి.. చంద్రబాబు, కేసీఆర్, జగన్, పవన్ లకు ఆహ్వానాలు పంపిన గవర్నర్

  • రాజ్ భవన్ లో సాయంత్రం ఎట్ హోం కార్యక్రమం
  • సాయంత్రం ఐదున్నర గంటలకు మొదలుకానున్న తేనీటి విందు
  • చంద్రబాబు దూరంగా ఉండే అవకాశం

ఇరు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ హైదరాబాదులోని రాజ్ భవన్ లో ఈరోజు ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఐదున్నర గంటలకు ఈ తేనీటి విందు కార్యక్రమం ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమానికి ఇరువురు ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లతో పాటు వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ లకు గవర్నర్ ఆహ్వానాలు పంపారు. ఈ తేనీటి విందు కార్యక్రమానికి కేసీఆర్, పవన్ కల్యాణ్, టీకాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు. జగన్ ప్రస్తుతం హైదరాబాదులో ఉండటంతో... ఆయన కూడా హాజరయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నట్టు సమాచారం.

More Telugu News