బీజేపీలో చేరనున్న మాజీ రాష్ట్రపతి మనవడు

షార్ట్స్‌లో చూడండి
భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవడు సుబ్రహ్మణ్యం శర్మ నేడు బీజేపీలో చేరనున్నారు. కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్ణాటకలో ఉన్న అసమానతలను తొలగించేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలిపారు.

 సమాజంలో ధనిక, పేద వర్గాల మధ్య అంతరాయం విపరీతంగా పెరిగిపోయిందని... దీన్ని తొలగించేందుకు ఎవరో ఒకరు పూనుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ అసమానతలను తొలగించేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి 'విమెన్ ఎంపవర్ మెంట్ పార్టీ' తరపున ఆయన పోటీ చేశారు. 
Go Back to Shorts
sarvepalli radhakrishnana
grandson
subrahmanyam sharma
bjp

More Telugu News