APSRTC: సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీఎస్ఆర్టీసీ యూనియన్లు

  • సంస్థ ఎండీకి ఎన్ఎంయూ సమ్మె నోటీసు
  • డిమాండ్లను పరిష్కరించకుంటే సమ్మె చేస్తామన్న యూనియన్
  • అధికారుల నిర్ణయంపై ఆసక్తి

ఏపీఎస్‌ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు సిద్ధమవుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేదంటే ఫిబ్రవరి 8 నుంచి సమ్మెకు వెళతామని నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) నేతలు సంస్థ ఎండీ సురేంద్రబాబుకు నేడు నోటీసు ఇచ్చారు. ఇప్పటికే తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఫిబ్రవరి 6 నుంచి సమ్మెకు వెళతామని ఈయూతోపాటు 9 సంఘాల జేఏసీ ప్రకటించింది. తాజాగా ఎన్ఎంయూ కూడా సమ్మె నోటీసు జారీ చేయడంతో అధికారులు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

More Telugu News