YSRCP: రిపబ్లిక్‌ టీవీ – సీ ఓటర్‌ తాజా సర్వే: ఏపీ లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ దూకుడు... 19 ఎంపీ సీట్లు గెలుచుకునే ఛాన్స్!

  • ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 19 సీట్లు
  • 6 సీట్లకు పరిమితం కానున్న టీడీపీ
  • కాంగ్రెస్, బీజేపీలకు ఒక్క సీటు కూడా రాదని అంచనా

మరో నాలుగు నెలల్లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 19 లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం 6 ఎంపీ సీట్లకు పరిమితం అవుతుందని ‘రిపబ్లిక్‌ టీవీ – సీ ఓటర్‌’ సర్వే వెల్లడించింది. 'నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరిట జరిపిన సర్వే ఫలితాలను రిపబ్లిక్‌ టీవీ విడుదల చేస్తూ, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, 25 లోక్‌సభ స్థానాలకుగానూ 19 వైసీపీకి, 6 టీడీపీకి వస్తాయని, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఒక్క సీటు కూడా దక్కదని అంచనా వేసింది. ఓట్ల శాతం పరంగా చూస్తే, వైసీపీకి 41.3 శాతం ఓట్లు, టీడీపీకి 33.1 శాతం ఓట్లు దక్కే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

More Telugu News