ram: రామ్ తో పూరి మాస్ మసాలా మూవీ మొదలైపోయింది

  • రామ్ హీరోగా పూరి మూవీ
  • సహ నిర్మాతగా చార్మీ
  • త్వరలో పూర్తి వివరాలు 

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమా చేయనున్నాడనే విషయం తెలిసిందే. ఈ సినిమా కొంతసేపటి క్రితమే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమాకి పూరి దర్శకుడిగానే కాదు .. నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. చార్మీ సహ నిర్మాతగా వుంది. ఈ సినిమాలో రామ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. కొంతకాలంగా ఆయన ఈ లుక్ పైనే శ్రద్ధ పెడుతూ వస్తున్నాడు.ఈ మధ్య కాలంలో రామ్ కి హిట్ పడలేదు. దాంతో ఆయనతోపాటు అభిమానులు కూడా నిరాశతో వున్నారు. ఇక పూరి కూడా హిట్ కొట్టి, చాలా కాలమే అయింది. దాంతో ఈ సారి తప్పకుండా సక్సెస్ ను పట్టుకోవాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా సెట్ అయింది. పూరి మార్క్ మాస్ కంటెంట్ తోనే ఈ సినిమా రూపొందనుందనే విషయం టైటిల్ ను బట్టే తెలుస్తోంది. మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి. 

More Telugu News