India: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... భారత్ ముందు ఓ సవాల్!

  • మరికాసేపట్లో ఇరు జట్ల మధ్యా మ్యాచ్
  • నేపియర్ వేదికగా తొలి వన్డే
  • భారత్ ముందు కఠిన పరీక్ష

నేపియర్ లో మరికాసేపట్లో ప్రారంభం కానున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ను ఎంచుకుంది. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించిన టీమిండియాకు న్యూజిలాండ్ లో అదే తరహాలో రాణించడం నిజంగా ఓ సవాలే. న్యూజిలాండ్ దేశంలో వీచే గాలులు, పిచ్ పై పరిస్థితులు పేస్ బౌలింగ్ కు, స్వింగ్ కు సహకరించడం ఇండియాను ఇబ్బంది పెట్టే అంశం. గతంలో ఒక్కసారి మాత్రమే న్యూజిలాండ్ పై ఇండియా వారి దేశంలో సిరీస్ ను గెలిచింది. ఇక ఇటీవలి న్యూజిలాండ్ ఆటగాళ్లు సాధించిన విజయాలను పరిశీలిస్తే, భారత్ ముందు కఠిన పరీక్ష ఉన్నట్టే లెక్క.

ఇండియా జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి (కెప్టెన్), ఎంఎస్ ధోనీ (కీపర్), కేదార్ జాదావ్, అంబటి రాయుడు, విజయ్ శంకర్, కుల్ దీప్ యాదవ్, యజువేంద్ర చాహాల్, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమి.
న్యూజిలాండ్ జట్టు: మార్టిన్ గుప్టిల్, కోలిన్ మున్రో, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, హెన్రీ నికోలస్, టామ్ లాథం, మిచేల్ శాంట్ నర్, డగ్ బ్రేస్వెల్, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.

More Telugu News