Nalgonda District: బెల్టుషాపు నిర్వాహకుడి ఆత్మహత్య.. పెద్దవూర గ్రామంలో ఉద్రిక్తత

  • టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ఘర్షణ
  • బెల్టుషాపులు కారణమని భావించిన పోలీసులు
  • సీఐ, ఎస్సైలపై దాడికి యత్నం
నల్గొండ జిల్లాల్లోని పెద్దవూరలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బెల్ట్ షాపు నిర్వాహకుడు ఆత్మహత్యకు పాల్పడటంతో ఒక్కసారిగా గ్రామంలో ఆందోళన నెలకొంది. సోమవారం రాత్రి గెమ్యానాయక్ తండాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణకు కారణం బెల్టుషాపులు కూడా అని భావించిన పోలీసులు నిర్వాహకులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో బెల్టుషాపు నిర్వాహకుడు శ్రీను(31) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి లోనైన మృతుని బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టడమే కాకుండా.. సీఐ, ఎస్సైలపై దాడికి యత్నించారు. దీంతో గ్రామమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Nalgonda District
Peddavura
Srinu
Suicide
TRS
Congress

More Telugu News