shalini: షాలినీ పాండే బంపర్ ఛాన్సే కొట్టేసింది

  • తొలి సినిమా 'అర్జున్ రెడ్డి'
  • యూత్ లో విపరీతమైన క్రేజ్
  • ఆదిత్య హీరోగా హిందీ సినిమా  

తెలుగు ప్రేక్షకులకు 'అర్జున్ రెడ్డి' సినిమాతో షాలినీ పాండే పరిచయమైంది. తొలి సినిమాతోనే ఈ అమ్మాయి కుర్రకారు మనసులను కొల్లగొట్టేసింది. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో, ఈ అమ్మాయి బిజీ అవుతుందని అంతా భావించారు. కానీ ఆ సినిమా తరువాత తెలుగు నుంచి ఆశించిన స్థాయిలో ఆమెకి అవకాశాలు రాలేదు. దాంతో తమిళ.. హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది.

ఈ నేపథ్యంలోనే హిందీలో ఒక భారీ ఆఫర్ ఈ సుందరికి వచ్చినట్టుగా తెలుస్తోంది. పరేష్ రావల్ తనయుడు ఆదిత్య హీరోగా అనురాగ్ కశ్యప్ 'బాంఫాడ్' సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా ఆయన షాలినీ పాండేను ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దర్శక నిర్మాతగా అనురాగ్ కశ్యప్ కి మంచి పేరు వుంది. ఆయన సినిమాలో ఛాన్స్ దొరకడం అంటే సగం సక్సెస్ కొట్టేసినట్టే అనే టాక్ వుంది. ఈ సినిమాతో షాలినీ పాండే దశ తిరిగిపోతుందనే టాక్ బాలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. 

  • Loading...

More Telugu News