dhanush: 'అసురన్'లో కీలక పాత్రలో మంజు వారియర్

  • ధనుశ్ తదుపరి చిత్రంగా 'అసురన్'
  • నిర్మాతగా కలై పులి థాను 
  • దర్శకుడిగా వెట్రి మారన్  

 తమిళ యువ కథానాయకులలో ధనుశ్ కి ప్రత్యేకమైన స్థానం వుంది. వైవిధ్యభరితమైన పాత్రలకి ప్రాధాన్యతనిచ్చే తమిళ కథానాయకులలో కమల్ .. విక్రమ్ .. సూర్య తరువాత స్థానంలో ధనుశ్ కనిపిస్తాడు. ఇటీవలే 'మారి 2' తో సందడి చేసిన ధనుశ్, ప్రస్తుతం 'అసురన్' సినిమా పనులతో బిజీగా వున్నాడు. వెట్రి మారన్ దర్శకత్వంలో ఈ సినిమా ఈ నెల 26వ తేదీన సెట్స్ పైకి వెళ్లనుంది.

గతంలో వెట్రిమారన్ .. ధనుశ్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. అందువలన ఈ సినిమాపై సహజంగానే అంచనాలు వున్నాయి. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం మంజు వారియర్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం. మలయాళంలో మంజు వారియర్ కి మంచి క్రేజ్ వుంది. అక్కడి స్టార్ హీరోల సినిమాల్లో ఆమె కీలక పాత్రల్లో మెప్పించింది. ఈ సినిమాలోనూ ఒక కీలకమైన పాత్ర కోసం ఆమెను తీసుకున్నారట. కలైపులి థాను నిర్మిస్తోన్న ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

More Telugu News