Srikakulam District: వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగిన శ్రీకాకుళం జెడ్పీ క్యాంప్ క్లర్క్.. ఆరోగ్య పరిస్థితి విషమం!

  • ఈ ఉదయం మీడియా సమావేశం
  • జడ్పీ సీఈఓ నగేష్ వేధిస్తున్నాడని ఆరోపణ
  • ఆ వెంటనే పురుగుల ముందు తాగిన సంతోష్ కుమార్
  • ప్రస్తుతం రిమ్స్ లో చికిత్స

శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ కార్యాలయం క్యాంప్ క్లర్క్ సంతోష్ కుమార్, మీడియా సమావేశంలో ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, జడ్పీ సీఈఓ నగేష్ తనను తీవ్రంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. తనకు పదోన్నతిలో అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ముందే పురుగుల మందు తాగారు.

ఆ వెంటనే ఆయన్ను స్థానిక ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించిన వైద్యులు, మెరుగైన చికిత్స కోసం రిమ్స్ కు తీసుకెళ్లాలని సూచించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News