BJP: పవన్ కల్యాణ్ ను కలిసేందుకు భారీ ర్యాలీతో బయలుదేరిన ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ

  • నిన్న బీజేపీకి రాజీనామా చేసిన ఆకుల
  • మరికాసేపట్లో జనసేనలో చేరనున్న రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే
  • పవన్ ఏం చెబితే అది చేస్తానని వెల్లడి

నిన్న బీజేపీకి రాజీనామా చేసిన రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకుని, విజయవాడలో ఉన్న పవన్ కల్యాణ్ ను కలిసేందుకు భారీ ర్యాలీగా బయలుదేరారు. ఆయన వెంట వందలాది వాహనాల్లో అనుచరులు, స్థానిక నేతలు కూడా బయలుదేరారు.

నిన్న ఆకుల తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తూ, దాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు పంపించగా, ఇంకా ఆయన ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. మరికాసేపట్లో తన అనుచరులతో కలిసి ఆకుల, జనసేన కండువాను కప్పుకోనున్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందు మీడియాతో ఆకుల మాట్లాడుతూ, పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తే, అక్కడి నుంచి పోటీ చేస్తానని, రాష్ట్రంలోని రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన ఆయనతోనే సాధ్యమవుతుందని నమ్ముతున్నానని అన్నారు.

More Telugu News