Chalasani Srinivas: కేంద్రంపై పోరాటం ఉద్ధృతం .. ప్రత్యేక హోదా సాధన సమితి నిర్ణయం

  • కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి పిలుపు
  • విద్యార్థులతో భారీ ర్యాలీ
  • రాష్ట్ర సరిహద్దుల ముట్టడి

ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి నేడు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో నాయకులు పలు కీలక నిర్ణయాల్లో భాగంగా ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి పిలుపునిచ్చారు. మోదీ రాష్ట్రానికి వచ్చే సమయంలో ఖాళీ కుండల ప్రదర్శనను నిర్వహించాలని నిర్ణయించారు.

ఓటాన్ అకౌంట్ రోజు బంద్, గుంటూరు, విజయవాడలలో విద్యార్థులతో భారీ ర్యాలీ, రాష్ట్ర సరిహద్దుల ముట్టడి, నాగార్జున యూనివర్సిటీ ఎదుట భారీ బహిరంగ సభ, రైల్ రోకో చేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు.

More Telugu News