Srikakulam District: ప్రియుడే యముడయ్యాడు.. వివాహేతర సంబంధం మిగిల్చిన విషాదం!

  • శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఘటన
  • ప్రియుడికి పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో గొడవ
  • హత్యచేసి దహనం చేసిన ప్రియుడు

తన భర్త దుబాయ్ లో ఉండగా, వివాహేతర సంబంధం పెట్టుకుని, ప్రియుడికి సర్వస్వాన్ని అప్పగించిన ఓ గృహిణి అతని చేతుల్లోనే బలై, తన ఇద్దరు పిల్లలనూ అనాధలను చేసింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, బలరాంపురం గ్రామానికి చెందిన కుశుమన్న, లక్ష్మిలకు 15 సంవత్సరాల క్రితం వివాహం కాగా, వారికి ఓ బాబు, ఓ పాప ఉన్నారు.

తాపీ పని చేసుకునే కుశుమన్న, ఉపాధిని వెతుక్కుంటూ దుబాయ్ వెళ్లగా, గ్రామంలో ఉండే సంపతిరావు భాస్కరరావుతో లక్ష్మి వివాహేతర బంధం పెట్టుకుంది. ఇటీవల భాస్కరరావుకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో లక్ష్మి అతనితో గొడవ పడింది. ఈ క్రమంలో ఆమెను వదిలించుకోవాలని భావించిన అతను ఆమెను బయటకు తీసుకెళ్లి చంపేసి, మృతదేహాన్ని దహనం చేశాడు. తన చెల్లెలు ఈ నెల 9వ తేదీ నుంచి కనిపించడం లేదని లక్ష్మి సోదరుడు అప్పన్న ఫిర్యాదు చేయడం, తమకు భాస్కరరావుపై అనుమానం ఉందని చెప్పడంతో, పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారించగా, నేరాన్ని అంగీకరించారు. 

More Telugu News