Telangana: అంతర్రాష్ట్ర బదిలీల విషయమై సీఎం కేసీఆర్ కు జగన్ లేఖ

  • అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీలపై ప్రత్యేక దృష్టి సారించాలి
  • మానవతా దృక్పథంతో బదిలీలు చేపట్టాలి
  • పరస్పర బదిలీలపై ఉత్తర్వులు విడుదల చేయాలి

తెలంగాణ సీఎం కేసీఆర్ కు వైసీపీ అధినేత జగన్ ఓ లేఖ రాశారు. అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీల అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతూ ఈ లేఖ రాశారు.
అంతర్రాష్ట్ర బదిలీలను సత్వరమే పూర్తి చేయాలని, మానవతా దృక్పథంతో ఆలోచించి బదిలీలు చేపట్టాలని కోరారు. పరస్పర బదిలీలపై కమిటీ సవరణ ఉత్తర్వులు విడుదల చేయాలని, అవి వెలువడిన వెంటనే ఉద్యోగుల బదిలీలు జరపాలని ఆ లేఖలో జగన్ విఙ్ఞప్తి చేశారు. 

More Telugu News