lakshimi`s NTR: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పునర్జన్మ దర్శనమంటూ వర్మ పోస్ట్

  • ముందు చెప్పిన సాయంత్రం 5 గంటల ముహూర్తంలో మార్పు 
  • ఎన్టీఆర్ కలలో కనిపించి చెప్పారట  
  • ఈరోజు సాయంత్రం 6.57 గంటలకు దివ్యముహూర్తం

ఎన్టీఆర్ డెత్ యానివర్సరీ అయిన జనవరి 18న సాయంత్రం 5 గంటలకు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రాణం పోసుకోబోతోంది’ అని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ముహూర్తం మారిందని, ఎన్టీఆర్ తనకు కలలో కనబడి చెప్పాడని, ఈరోజు సాయంత్రం 5 గంటలకు బదులుగా 6.57 గంటలకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ దివ్యముహూర్తం నిర్ణయించడం జరిగిందని వర్మ పేర్కొన్నారు. 6+5+7= 18 అని, 1+8=9 అని.. ఎన్టీఆర్ కు పవిత్రమైన సంఖ్య ‘9’ అని వర్మ వివరించి చెప్పడం గమనార్హం.

https://twitter.com/RGVzoomin/status/1086235064231440387

More Telugu News